న్యూఢిల్లీ : నేపాల్ లలిత్పూర్ జిల్లాలోని ఓ పారిశ్రామిక ప్రాంతంలోని ఆక్సిజన్ ప్లాంట్లో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పటాన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని సాగర్మాత ఆక్సిజన్ ప్లాంట్లో గురువారం ఉదయం కార్మికులు సిలిండర్లో గ్యాస్ నింపుతున్న సమయంలో పేలుడు జరిగిందని పోలీసులు వెల్లడించారు. బ్లాస్ట్ కారణంగా ఆక్సిజన్ ప్లాంట్ జింక్ పైకప్పు సైతం ధ్వంసమైంది.
పక్కన ఉన్న భవనాల కిటకిటీలు దెబ్బతిన్నాయి. ఘటనలో బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని రతన్పూర్వా గ్రామానికి చెందిన బ్రిజ్ మహతో (45) పేలుడులో అక్కడికక్కడే మరణించగా, మరో భారతీయుడు రాజ్ కుమార్ మహతో (25) లలిత్పూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టి, ఘటనపై విచారణ జరుపాలని నేపాల్ హోంశాఖ మంత్రి బాలకృష్ణ ఖండ్ పోలీసులను ఆదేశించారు.