కోల్కతా, ఆగస్టు 27: బాణసంచా తయారు చేస్తున్న ఓ పరిశ్రమలో పేలుడు సంభవించి ఏడుగురు మరణించారు. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లా జగన్నాథపూర్లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా హఠాత్తుగా పేలుడు సంభవించింది.
అగ్నిమాపక, ఇతర శాఖల అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికి తీశామని, ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.