Explotion : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం విరుధ్నగర్ జిల్లా (Virudh Nagar) సత్తూరు (Sattur) లోని ఎక్సెల్ ఫైర్వర్క్స్ (Exel Fire Works) బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ వెంటనే పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఈ ఘటనలో ఫ్యాక్టరీ పరిసరాల్లో పార్క్ చేసిన వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను ఆస్పత్రికి తరలించారు.
పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని ఐదు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కాగా పేలుడు సమయంలో 60 మంది లోపల ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలో టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఘటన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఫ్యాక్టరీలో కార్మికులు ఉన్నారని స్థానికులు చెబుతుండటంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెద్దగానే ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
#WATCH | Tamil Nadu | An explosion occured at a fireworks factory near Sattur in Virudhunagar district. More details awaited.
(Video Source: Fire Department) pic.twitter.com/rwuvHHHtaL
— ANI (@ANI) April 13, 2026