Artificial Intelligence | న్యూఢిల్లీ: టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఏఐతో భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలపై నిపుణుల్లో ఆందోళన పెరుగుతున్నది. ఆదిలోనే ఏఐ వినియోగంపై నియంత్రణ సాధించకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు ఏదుర్కోవాల్సి వస్తుందని వివిధ రంగాల మేధావులు హెచ్చరించారు. సెంటర్ ఫర్ ఏఐ సేఫ్టీ (సీఏఐఎస్) వెబ్సైట్లో దాదాపు 350 మంది వివిధ రంగాల నిపుణులు సంతకాలతో ఓ ప్రకటన చేశారు.
‘ఏఐతో అంతరించిపోయే రంగాలను తగ్గించటంతోపాటు అంటువ్యాధులు, అణు యుద్ధాల వంటి సామూహిక ప్రమాదాలను కూడా నివారించేందుకు చర్యలు చేపట్టాలి’ అని పిలుపునిచ్చారు. ఈ ప్రకటనపై సంతకాలు చేసినవారిలో ప్రముఖ ఏఐ కంపెనీలు ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మ్యాన్, గూగుల్ డీప్మైండ్ సీఈవో డెమిస్ హస్సాబిస్, ఆంత్రోపిక్ సీఈవో డేరియో అమోడీ ఉన్నారు.