coronavirus | న్యూఢిల్లీ, డిసెంబర్ 19: కరోనాకు సంబంధించి ప్రతి కొత్త వేవ్ డిసెంబర్ లేదా శీతాకాలంలోనే మొదలయ్యాయని ఇన్సాకాగ్ అడ్వైజరీ బోర్డు కో చైర్ సౌమిత్ర దాస్ అన్నారు. దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేవని చెప్పారు. విమానాశ్రయాలు, సరిహద్దుల్లో కొవిడ్-19 టెస్టింగ్, నిఘాను పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇతర వేరియెంట్స్తో సహా, జేఎన్.1 వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. దేశంలో జేఎన్.1 మొదటి కేసు కేరళలో డిసెంబర్ 8న నమోదైంది.
వారం రోజుల్లోనే ఇక్కడ కేసుల సంఖ్య 277శాతం పెరిగినట్టు అక్కడి వైద్య అధికారులు వెల్లడించారు. ప్రజలు మాస్క్లు ధరించి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు, జేఎన్.1ను ‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మంగళవారం ప్రకటించింది. జేఎన్.1 సహా ఇతర వేరియెంట్స్ నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తాయని, దీని నుంచి ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు ఉండదని తెలిపింది.