న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మునిగే నావలాంటిదని, రాహుల్ ఓ పిచ్చోడని ఆ పార్టీ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ గ్యారంటీలపై రాహుల్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన మతిస్ధిమితం కోల్పోయిన వ్యక్తి ఏమైనా మాట్లాడతారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ రాముడి వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక పార్టీగా కుచించుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నుంచి నేతలు ఇతర పార్టీల్లోకి వలస బాట పట్టారని అన్నారు. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారన్న గ్యారంటీ లేదని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆచార్య ప్రమోద్ కృష్ణం తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.
మతిస్ధిమితం లేని, ఆలోచన లేనివారు చేసే వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరని అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్లో ఉన్నంతవరకూ ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యానించారు. రాముడి గురించి అనుచితంగా మాట్లాడే పార్టీలో ఉండాలని ఎవరకూ కోరుకోరని ఆయన స్పష్టం చేశారు.
Read More :
Rhino | 1.5 కిలోమీటర్లు.. సఫారీ వెహికల్ను తరిమిన ఖడ్గమృగం.. వీడియో