గువాహటి: అస్సాంలోని మనాస్ నేషనల్ పార్క్లో (Manas National Park) సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్టులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాన్ని ఓ ఖడ్గమృగం (Rhinoceros) వెంబడించింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. మానస్ జాతీయ పార్కులోని బన్స్మారీ ఫారెస్ట్ జోన్లో పర్యాటకులతో సఫరీకి వెళ్లిన జీపును ఒక ఖడ్గమృగం వెంటాడింది. ఏదో వందో, 2 వందల మీటర్లు కాదు.. ఏకంగా 1.5 కిలోమీటర్లు వారి జీపును తరిమింది. ఎంతకీ అది ఆగకపోవడండతో జీపు డ్రైవర్ వేగం పెంచాడు.. దీంతో అది నెమ్మదించింది. దీన్నంతా ఆ జీపులో ఉన్న పర్యాటకుడు తన కెమెరాలో బంధించాడు.
ఖడ్గమృగాలు పర్యాటకులను తరమడం ఇదే మొదటిసారి కాదు.. 2022లో కూడా కజిరంగా జాతీయ పార్కులో సఫారీకి వెళ్లిన పర్యాటకుల జీపులను ఓ రైనో గుంపు వెంబడించింది. అటవీ మార్గంలో వెళ్తున్న జీపును.. పొదల్లో ఉన్న ఖడ్గమృగాలు సుమారు 2 కిలోమీటర్ల వరకు తరమాయి. కాగా, ఎన్నో రకాల జంతువులు, పక్షులు, పులులకు నెలవుగా ఉన్న మానస్ నేషనల్ పార్కుకు 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు లభించింది.
Rhino chases park vehicle, for about 1.5 kms in Bansbari range of World Heritage Manas National Park#Rhino #Assam #ManasNationalPark pic.twitter.com/PbHZClsPxf
— News18 (@CNNnews18) March 9, 2024