Karnataka Exit Polls | కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో వెల్లడైంది. పీపుల్స్ పల్స్, టీవీ 9 భారత్ వర్ష్, జీ న్యూస్ మాట్రైజ్ ఏజెన్సీ, రిపబ్లిక్ టీవీ- పీ మార్క్, జీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కాంగ్రెస్కే అత్యధిక స్థానాలు దక్కుతాయని పేర్కొన్నాయి. అయితే కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ వస్తుందని మాత్రం ఏ ఒక్క సర్వే కూడా కచ్చితంగా చెప్పలేదు.
పీపుల్స్ పల్స్
మొత్తం 224 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీకి 107 నుంచి 119 స్థానాలు దక్కే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది. అధికార బీజేపీకి కేవలం 78 నుంచి 90 సీట్లు మాత్రమే వస్తాయని స్పష్టం చేసింది. ఇక జేడీఎస్కు 23 నుంచి 29 స్థానాలు దక్కవచ్చునని పేర్కొంది. ఇతరులు 1 నుంచి 3 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉందని ప్రకటించింది.
టీవీ9 భారత్ వర్ష్
ఇక టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ స్థానాలు వస్తాయని తేలింది. కాంగ్రెస్ పార్టీకి 99 నుంచి 109 స్థానాలు వచ్చే అవకాశం ఉందని టీవీ9 భారత్ వర్ష్ పేర్కొంది. అధికార బీజేపీ 88 నుంచి 98 స్థానాలకు పరిమతమవుతుందని తెలిపింది. జేడీఎస్కు 21 నుంచి 26 స్థానాలు, ఇతరులకు 0 నుంచి 4 స్థానాలు దక్కనున్నట్లు వెల్లడించింది.
జీన్యూస్ మాట్రైజ్ ఏజెన్సీ
అదేవిధంగా జీన్యూస్ మాట్రైజ్ ఏజెన్సీ సర్వేలో కూడా కాంగ్రెస్కే మెజారిటీ వస్తుందని తేలింది. ఆ పార్టీ 103 నుంచి 118 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీన్యూస్ మాట్రైజ్ ప్రకటించింది. బీజేపీకి 79 నుంచి 94 సీట్లు, జేడీఎస్కు 25-33 సీట్లు, ఇతరులకు 2 నుంచి 5 స్థానాలు దక్కనున్నట్లు తెలిపింది.
రిపబ్లిక్ టీవీ-పీమార్క్
రిపబ్లిక్ టీవీ-పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కూడా కాంగ్రెస్ మెజారిటీ వస్తుందని వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 108 సీట్లు వచ్చే ఛాన్స్ ఉండగా.. బీజేపీకి 85 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. జేడీఎస్కు 24 నుంచి 32 స్థానాలు దక్కవచ్చని అంచనా వేసింది. ఇతరులు 2 నుంచి 6 స్థానాలు గెలుస్తారని తెలిపింది.
జీ మార్క్ సర్వే
ఇక జీ మార్క్ సర్వేలో కాంగ్రెస్దే మెజారిటీ అని తేలింది. కాంగ్రెస్ పార్టీ 103 నుంచి 118 స్థానాల్లో, బీజేపీ 79 నుంచి 94 స్థానాల్లో, జేడీఎస్ 25 నుంచి 33 సీట్లలో విజయం సాధిస్తుందని జీ మార్క్ అంచనా వేసింది.
కేవలం సువర్ణ న్యూస్-జన్ కీ బాత్, న్యూస్ నేషన్ – సీజీఎస్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మాత్రమే బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని వెల్లడించాయి.
సువర్ణ న్యూస్-జన్ కీ బాత్
సువర్ణ న్యూస్-జన్ కీ బాత్ అంచనాల ప్రకారం అధికార బీజేపీ 94 నుంచి 117 స్థానాలు గెలువనుంది. కాంగ్రెస్ పార్టీ 91 నుంచి 106, జేడీఎస్ 14 నుంచి 24, ఇతరులు 0 నుంచి 2 స్థానాల్లో విజయం సాధించనున్నారు.
న్యూస్ నేషన్ – సీజీఎస్
న్యూస్ నేషన్ – సీజీఎస్ ప్రకారం.. బీజేపీ 114 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ను దాటి తిరిగి అధికారం నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్ 86 స్థానాల్లో, జేడీఎస్ 21 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో గెలువనున్నారు.