న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ కోసం ఈ నెల 21న తమ ముందు హాజరుకావాలని ఈడీ తన నోటీసులలో పేర్కొన్నది.
కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్సింగ్ ఈ కేసులో అరెస్టయ్యారు. సీఎం కేజ్రీవాల్ను ఇప్పటికే ఈ కేసులో ఒకసారి విచారించగా ఇప్పుడు మరోసారి నోటీసుల పంపింది.