Yusuf Pathan | కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 42 లోక్సభ స్థానాలకు ఆమె అభ్యర్థులను ప్రకటించారు. టీమిండియా మాజీ క్రికెట్ యూసుఫ్ పఠాన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. యూసుఫ్ పఠాన్ బెహరంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు మమత పేర్కొన్నారు.
యూసుఫ్ పఠాన్ ఇవాళే మమత బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మెగా ర్యాలీలో పఠాన్.. టీఎంసీ కండువా కప్పుకున్నారు. ఇదే వేదిక నుంచి మమత ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు.
ప్రస్తుతం బెహరంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బెంగాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన అధిర్ రంజన్ చౌదరీ.. ఈసారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.