జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్కు మరో షాక్ ఎదురైంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి మహేంద్రజీత్ సింగ్ మాలవీయ బీజేపీలో చేరారు. (Congress MLA Joins BJP) సోమవారం ఉదయం రాజస్థాన్లోని బీజేపీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. రాజస్థాన్ బీజేపీ ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, ఆ రాష్ట్ర చీఫ్ సీపీ జోషి, ఇతర బీజేపీ నేతల సమక్షంలో కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. బన్స్వారా జిల్లాలోని బగిదొర ఎమ్మెల్యే అయిన మాలవీయ గిరిజన వగడ్ ప్రాంత అభివృద్ధి కోసం బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు చెప్పారు. బీజేపీ జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం తనను ప్రభావితం చేసిందని తెలిపారు. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేయడం తనను బాధించిందని అన్నారు.
కాగా, మహేంద్రజీత్ సింగ్ మాలవీయ 2008 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2008 నుంచి 2013 వరకు, తిరిగి 2021 నుంచి 2023 వరకు మంత్రిగా పనిచేశారు. 1998లో బన్స్వారా నుంచి కాంగ్రెస్ టికెట్పై లోక్సభకు ఎన్నికయ్యారు.