కర్నాటకలో నడుస్తున్న వ్యవహారాలపై మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ స్పందించారు. అజాన్ విషయంలో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని బీజేపీ గనక తుది నిర్ణయం తీసుకుంటే.. కర్నాటకలో ఆ పార్టీ పాలనకు తెరపడినట్లేనని అన్నారు. ఒక వేళ బీజేపీ అన్నంత పనీ చేస్తే.. ఇక ఆ పార్టీకి రాష్ట్రంలోనూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా స్పందించారు. ముస్లిం వర్గాన్ని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. లౌడ్ స్పీకర్ల ద్వారా తమకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని పేర్కొన్నారు. అధికారం కోసం బీజేపీ సమాజాన్ని విభజిస్తోందని, ఎన్నికల్లో గెలవడానికే ఇలా చేస్తోందని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో లౌడ్స్పీకర్ల అంశం బీజేపీ ప్రభుత్వానికి బూమారంగ్ అవుతుందన్నారు.
ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తీవ్రంగా మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ప్రతిపక్షాలన్నీ ఇలా చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్నిడెసిబెల్స్ ఉండాలన్న విషయంపై హైకోర్టు ఓ స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. తాము కేవలం అజమ్ లౌడ్స్పీకర్ల విషయంలోనే అభ్యంతరాలు చెప్పడం లేదని, అన్ని లౌడ్ స్పీకర్లకూ ఇది వర్తిస్తుందని సీఎం బొమ్మై స్పష్టం చేశారు.