న్యూఢిల్లీ: మే 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల(EVMs)పై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఆఫ్రికాలో వాడిన ఈవీఎంలను కర్నాటక పోల్స్కు వాడినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఈసీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలాకు రాసిన లేఖలో .. ఈసీఐఎల్ ఉత్పత్తి చేసిన కొత్త ఈవీఎంలను కర్నాటక ఎన్నికల్లో ఉపయోగించినట్లు ఈసీ వెల్లడించింది. ఇప్పటి వరకు ఎటువంటి ఈవీఎంలను దక్షిణాఫ్రికాకు పంపలేదని ఎన్నికల సంఘం చెప్పింది. సౌతాఫ్రికాలో ఎన్నికల కోసం ఈవీఎంలను వాడడం లేదని వెల్లడించింది.
మరో వైపు రేపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఆ రాష్ట్రవ్యాప్తంగా 73 శాతం ఓట్లు పోలైన విషయం తెలిసిందే. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ .. కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి.