న్యూఢిల్లీ: ముంబై మహానగరంలో ప్రతి ఒక్కరికీ ఈ ఏడాది నవంబర్ చివరి నాటి వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చాహల్ తెలిపారు. నగరంలో ప్రతి ఒక్క పౌరుడు వ్యాక్సినేట్ అయిన తర్వాతనే.. పూర్తి స్థాయిలో ఆంక్షలను తొలగించనున్నట్లు ఆయన వెల్లడించారు. తాజాగా నగరంలో ఓ పేషెంట్.. డెల్టా ప్లస్ వేరియంట్ సోకి మరణించడంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితి నెలకొన్నది. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది.