న్యూఢిల్లీ, జూలై 28: స్వల్ప, మధ్యస్థ ఆదాయం గల పేద దేశాల్లో (ఎల్ఎంఐసీ) క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న ప్రతి 15 మంది చిన్నారులలో ఒకరు చికిత్సా సంబంధ సమస్యలతో మృతి చెందుతున్నారని ఒక పరిశోధన వెల్లడించింది. ద లాన్సెట్ ఆంకాలజీలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఎల్ఎంఐసీలలో క్యాన్సర్ కారణంగా 45 శాతం మంది చిన్నారులు కన్నుమూస్తుండగా, అదే ధనిక దేశాలో ఇది కేవలం మూడు నుంచి ఐదు శాతం మాత్రమే ఉంది.
501 వ్యాసాలను విశ్లేషణాత్మక అధ్యయనం చేసి, 0 నుంచి 21 ఏండ్ల వయసున్న వారిపై జరిపిన పరిశోధనల అనంతరం తామీ విషయాన్ని నిర్ధారించామని పరిశోధకులు తెలిపారు.