ముంబై, సెప్టెంబర్ 28: వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూనే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే ప్రధాని మోదీకి సొంత పార్టీ నేతే ఝలక్ ఇచ్చారు. తాను కూడా రాజకీయ కుటుంబం నుంచే వచ్చానని, అయితే ప్రజల మనస్సుల్లో చోటు ఉంటే తన రాజకీయ జీవితాన్ని ముగించడం మోదీ వల్ల కూడా కాదని బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజ ముండే అన్నారు. మంగళవారం మహారాష్ట్రలోని బిడ్ జిల్లా అంబాజోగాయిలో నిర్వహించిన సభలో ఆమె పైవిధంగా వ్యాఖ్యానించారు.