ముంబై: ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. చనిపోయినా సరే.. తానెవరికీ తలొగ్గేదిలేదని చెప్పారు. ఎలాంటి కుభకోణతో తనకు సంబంధం లేదని, బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. ఈడీ అధికారుల సోదాలపై సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అవన్నీ తప్పుడు కేసులు, తప్పుడు ఆధారాలని ఆగ్రహం వ్యక్తం కేశారు. బాలాసాహెబ్ ఎలా పోరాడాలో తమకు నేర్పారని, శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని ట్వీట్ చేశారు.
"Maharashtra and Shiv Sena will continue to fight," tweets Shiv Sena leader Sanjay Raut as Enforcement Directorate conducts a search at his Mumbai residence pic.twitter.com/jOi3l6JCab
— ANI (@ANI) July 31, 2022
ముంబైలో సంజయ్ రౌత్ ఇంటిపై ఆదివారం ఉదయం ఈడీ అధికారులు దాడిచేశారు. పాత్రచాల్ భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, విచారణకు హాజరవ్వాలని ఈడీ ఆయనకు రెండుసార్లు నోటీసులు జారీచేసింది. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తాను విచారణకు రాలేనని, ఆగస్టు 7 తర్వాత హాజరవుతానని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులే ఎంపీ ఇంటికి రావడం గమనార్హం.
కాగా, ఈడీ సోదాల నేపథ్యంలో శివసేన కార్యకర్తలు సంజయ్ రౌత్ ఇంటికి భారీగా తరలివచ్చారు. ఈడీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.