కోల్కతా: పశ్చిమ బెంగాల్ శాసనసభను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం రద్దు చేశారు. దీని అర్థం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ(Mamata Banerjee) ఇకపై ముఖ్యమంత్రి కాదు. తాజా ఎన్నికల్లో ఆమె ఎక్కడా విజయం సాధించ లేదు కాబట్టి కనీసం ఆమె ఎమ్మెల్యే కూడా కాదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 172లోని 2వ క్లాజ్ ప్రకారం శాసనసభ రద్దును మే 7వ తేదీ నుంచి అమలు చేసినట్టు గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. బెంగాల్ సర్కారును రద్దు చేసినా.. మమతా బెనర్జీ మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్లో ముఖ్యమంత్రి టైటిల్ పెట్టుకున్నారు.
సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని ఇటీవల దీదీ భీష్మించిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ అఫిషియల్ ఎక్స్ అకౌంట్ ప్రొఫైల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఫౌండర్ చైర్పర్సన్, హానరబుల్ చీఫ్ మినిస్టర్, వెస్ట్ బెంగాల్ అని ఇంకా రాసి ఉన్నది. ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల లూటీ ద్వారా బీజేపీ ఈ ఎన్నికల్లో అక్రమంగా, అనైతికంగా గెలిచిందని, తనకు న్యాయం జరిగే వరకు పదవి నుంచి దిగనంటూ మమతా బెనర్జీ భీష్మించుకుని కూర్చోవడంతో గవర్నర్ ఆ రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు.