న్యూఢిల్లీ: నెలకు రూ.7500 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నట్టు ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ వెల్లడించింది. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేయనున్నట్టు పెన్షనర్ల జాతీయ ఆందోళన కమిటీ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రౌత్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు.
జాతీయ నేతలకు మద్దతుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరాహార దీక్షలు చేయాలని సభ్యులకు కమిటీ పిలుపునిచ్చింది. ప్రస్తుత రూ.1170 పెన్షన్తో తమ కనీస అవసరాలను ఎలా తీర్చుకోవాలని వారు ప్రశ్నించారు.