న్యూఢిల్లీ: సాధారణంగా వృద్ధుల్లో కనిపించే పార్కిన్సన్స్ వ్యాధి (వణుకుడు) పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల యువతనూ పట్టిపీడిస్తున్నదని వైద్యులు వెల్లడించారు. పార్కిన్సన్స్ వ్యాధి నాడీ వ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్య. ఈ వ్యాధి బారిన పడ్డవారి శరీరం వణుకుతూ ఉంటుంది.
‘ఈ వ్యాధికి సరైన కారణాన్ని ఇప్పటివరకు గుర్తించనప్పటికీ జన్యు సంబంధ కారణాలదే కీలకపాత్ర. ప్రస్తుత జీవనశైలి, పర్యావరణ మార్పుల వల్ల యువత కూడా ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని ఫరీదాబాద్లోని సర్వోదయ హాస్పిటల్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్ రీతు ఝా తెలిపారు. వాయు కాలుష్యం, సూక్ష్మమైన నలుసు, కొన్ని రకాల పురుగు మందులు, క్రిమిసంహారకాల వల్ల కూడా ఈ వ్యాధి ముప్పు ఏర్పడుతుందని, దీని వల్ల మెదడులో వాపు, ఒత్తిడి ఏర్పడుతుందన్నారు.