చండీఘఢ్ : చాలీచాలని జీతాలతో విసుగుచెందిన ఇద్దరు టెకీలు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని వెజ్ బిర్యానీ అమ్ముతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఫుడ్ బిజినెస్ కోసం ఇద్దరు ఇంజనీర్లు తమ కొలువులను విడిచిపెట్టారు. 9-5 జాబ్ కంటే తమకు ఇదే సంతృప్తికరంగా ఉందని హర్యానాలోని సోనిపట్లో వెజిటబుల్ బిర్యానీ స్టాల్ నడుపుతున్న వారిద్దరూ చెబుతున్న మాట.
ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలకు ఇస్తున్న జీతం పట్ల తీవ్ర అసంతృప్తితోనే తాము ఇంజనీర్ వెజ్ బిర్యానీ పేరుతో ఫుడ్ బిజినెస్లోకి దిగామని టెకీలు రోహిత్, సచిన్ చెబుతున్నారు. సోనిపట్ సహా ఇతర ప్రాంతాల్లోనూ వీరి స్టాల్ కనిపిస్తుంది.
జాబ్లో వచ్చే జీతం కంటే వ్యాపారంలో తమ రాబడి మెరుగ్గా ఉందని వారు అంటు. నూనె లేకుండా వారు వడ్డించే వెజ్ బిర్యానీ ప్లేట్ రూ 70, హాఫ్ ప్లేట్ రూ 50గా ధర నిర్ణయించారు. తమ వెజిటబుల్ బిర్యానీని కస్టమర్లు అమితంగా ఇష్టపడుతుండటంతో వ్యాపారాన్ని విస్తరించాలని వారు భావిస్తున్నారు.