పుణె: క్యాంపస్ ప్లేస్మెంట్ రాదనే భయంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి (Engineering Student) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని పుణెలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఐటీ హబ్ పుణెకి చెందిన 21 ఏండ్ల యువకుడు ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ నాలుగో ఏడాది చదువుతున్నాడు. కోర్సు ముగుస్తుండటంతో కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి.
అయితే తనకు ఉద్యోగం రాదేమోనని ఆందోళన చెందిన యువకుడు తన నివాస సముదాయంలోని ఎనిమిదో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.