నాగ్పూర్: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆస్తులపై దాడులు నిర్వహించారు. నాగ్పూర్లో, ముంబైలోని వర్లి ఏరియాలో గల ఆయన నివాసాల్లో.. రెండు వేర్వేరు ఈడీ టీమ్లు ఏక కాలంలో సోదాలు చేపట్టాయి. సోదాల్లో భాగంగా అనిల్ దేశముఖ్, ఆయన కుటుంబసభ్యుల పేర్ల మీద ఉన్న స్థిర, చర ఆస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు.