ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనను ప్రశ్నించనున్నట్లు ఆ నోటీసులలో పేర్కొన్నది. అనిల్ దేశ్ముఖ్పై మనీలాండరింగ్ కేసు నమోదు కావడంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఈడీ నాగ్పూర్, ముంబైలోని ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది.
తాజాగా ఆ కేసు విషయమై మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు సమన్లు జారీచేసింది. కాగా, తనకు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యే అంశంలో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అనిల్ దేశ్ముఖ్ ఈడీకి లేఖ రాశారు. ఆడియో లేదా వీడియో పద్ధతుల్లో మీకు ఏది సమ్మతమైతే అలా, మీకు వీలైన సమయంలో వాంగ్మూలం ఇస్తానని ఆయన ఈడీని కోరారు.