జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మరోసారి తన వ్యతిరేక గళం వినిపించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత అస్థిరతకు తెరదించాలని అధిష్ఠానాన్ని కోరారు. పార్టీలో అనిశ్చితికి తెరదించేందుకు ఇది సరైన సమయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్ఠానంపై తిరగబడ్డ గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేలను శిక్షించాలని హైకమాండ్ను కోరారు.
అయితే, కాంగ్రెస్ పార్టీలో తప్పుచేసిన వారిని శిక్షించే విషయంలో సీనియర్, జూనియర్ అనే భేదాలు ఉండవని పైలట్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఆ ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్లో పరిస్థితిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ పరిశీలకులు కేసీ వేణుగోపాల్ చెప్పినట్లు పైలట్ వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్పై పోటీ చేయాలని హైకమాండ్.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ను కోరింది. దాంతో సీఎం పదవిని సచిన్ పైలట్కు వదులుకోవడం ఇష్టం లేని గెహ్లాట్ తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాడు. దాంతో హైకమాండ్ ఖర్గేను బరిలో దింపి గెలిపించుకున్నప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయంపై తిరగబడ్డ ఎమ్మెల్యేలపై ఇంకా చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో పైలట్ వారిపై చర్యలకు డిమాండ్ చేశారు.