Encounter | రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు సమాచారం. ఇందులో ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోందం బాలకృష్ణ సైతం ఉన్నట్లు సమాచారం. రాయ్పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ఎన్కౌంటర్ను ధ్రువీకరించారు. గరియాబంద్లో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయని.. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొందరు మావోయిస్టులు చనిపోయి ఉండవచ్చని ఐజీ పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలోని పల్లి-బార్సూర్ రోడ్డు ప్రాంతంలో ప్రెజర్ ఐఈడీ పేలుడులో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దంతేవాడ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) గౌరవ్ రాయ్ మాట్లాడుతూ.. మందుపాతరలను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ సమయంలో పేలుడు జరిగిందని పేర్కొన్నారు. ప్రెజర్ ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని.. ఇందులో ఒకరు ఇన్స్పెక్టర్ అని పేర్కొన్నారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ టీమ్ జవాన్ గాయపడ్డట్లు చెప్పారు. గాయపడిన ఇద్దరు దంతేవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. మెరుగైన వైద్య సంరక్షణ కోసం రాయ్పూర్కు హెలికాప్టర్ ద్వారా తరలించనున్నట్లు తెలిపారు. గాయపడిన సిబ్బంది సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్కు చెందినవారని చెప్పారు.