శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బందిపొరాలోని బ్రార్ అర్గామ్ వద్ద శుక్రవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కశ్మీర్ పోలీస్ జోన్ ట్వీట్ చేసింది. ఉగ్రవాదులకు సంబంధించి సమాచారం అందడంతో బ్రార్ ప్రాంతాన్ని పోలీసులు, భద్రతా బలగాలు చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరగ్గా.. ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.
ఇంకా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగతుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతి చెందిన ఉగ్రవాదుల ఆచూకీ తెలియనది, వారిని ఎవరనే విషయంపై నిర్ధారించనున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, లష్కరే తోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తెల్లవారు జామున కమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఓ పోలీస్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్ థోకర్పై కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.