శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ షోపియాన్ జిల్లాలోని తుర్క్వాగమ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ పౌరుడు గాయపడ్డారు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం మేరకు తర్క్వాగమ్ పుల్వామాతో కలిపే వంతెన వంతెన సమీపంలో సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ బృందంపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఓ పౌరుడు గాయపడ్డారు. వెంటనే అతన్ని బలగాలు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని తుర్క్వాగమ్కు చెందిన షోయబ్ ఘనీగా గుర్తించారు. ఇదిలా ఉండగా.. కాల్పుల తర్వాత ఉగ్రవాదులు సమీపంలో ఉన్న తోటల్లోకి పారిపోయారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.