KS Eshwarappa | బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోసారి వివాదంలో చిక్కుకొన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలను దేశద్రోహులుగా పేర్కొన్న ఆయన.. వారిని కాల్చి చంపేందుకు వీలు కల్పించే ఒక చట్టం చేయాలంటూ పిలుపునిచ్చారు.
దావణగెరె జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఈశ్వరప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకుంటున్నారని, వారు దేశద్రోహులని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు మరోసారి అలాంటి ప్రకటనలు చేసేందుకు ప్రయత్నిస్తే, ఈ విషయాన్ని తాను ప్రధాని మోదీ దృష్టికి దగ్గరకు తీసుకెళ్లి వారిని కాల్చి చంపేలా చట్టం చేయాలని కోరుతారన్నారు.