Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా (Tesla) అధినేత, ట్విట్టర్ సీఈవో (Twitter CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi)ని ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో మస్క్ 195 మందిని అనుసరిస్తుండగా.. ఆ జాబితాలో ప్రధాని మోదీ పేరు కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ‘మోదీని మస్క్ ఫాలో అవుతున్నారంటే.. టెస్లా త్వరలో ఇండియాకి రాబోతోందనడానికి సంకేతమా..?’ అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘టెస్లాను భారత్కు పరిచయం చేసేందుకే.. మోదీని మస్క్ ఫాలో అవుతున్నారు’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ (microblogging site) ట్విట్టర్ (Twitter)లో ) అత్యధికమంది ఫాలోవర్లు (Followers) కలిగిన వ్యక్తిగా మస్క్ ఇటీవల చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ట్విట్టర్లో మస్క్కు ఏకంగా 133 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రికార్డుతో ఇప్పటి వరకు ట్విట్టర్లో అత్యధికమంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో కొనసాగుతన్న అమెరికా మాజీ అధ్యక్షుడు (former US president) బరాక్ ఒబామాను (Barack Obama) మస్క్ (Musk) అధిగమించారు. మస్క్ రికార్డుతో ఒబామా రెండో స్థానానికి పడిపోయారు.
Elon Musk is now following Narendra Modi (@narendramodi)
— ELON ALERTS (@elon_alerts) April 10, 2023