Elon Musk : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో మానవ మేథను అధిగమిస్తుందనే టాపిక్పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ కొనసాగుతోంది. టెక్నాలజిస్టులు, సైంటిస్టులు, పరిశోధకులు దీనిపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇక ఓపెన్ఏఐ గత ఏడాది జనరేటివ్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీని లాంఛ్ చేసిన తర్వాత ఉద్యోగాలపై ఏఐ పెనుప్రభావం చూపుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది.
గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు సొంతంగా జనరేటివ్ ఏఐ టూల్స్ను లాంఛ్ చేయడంతో భవిష్యత్లో మనుషులు చేసే ఉద్యోగాలు కనుమరుగవుతాయనే వార్తలు టెకీలను కలవరపరుస్తున్నాయి. ఇక టెస్లా బాస్ ఎలన్ మస్క్ ఇటీవల ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ మనుషుల కంటే తెలివిగా వ్యవహరించే రోజు ఎంతో దూరంలో లేదని మస్క్ పేర్కొన్నారు.
2029 సంవత్సరాంతం నాటికి మానవ మేథను ఏఐ అధిగమిస్తుందని మస్క్ అంచనా వేశారు. మానవ మేథస్సు స్ధాయిని 2029 నాటికి ఏఐ అధిగమించగలదని ఫ్యూచరిస్ట్ రే కుజ్వెల్ కూడా స్పష్టం చేశారు. 1999లోనే ఆయన ఏఐ, కంప్యూటర్ అడ్వాన్స్మెంట్పై ఈ అంచనా వెల్లడించారు. ఏఐ మానవ మేథను అధిగమించేందుకు మరో వందేండ్లు పడుతుందని ప్రజలు భావిస్తున్నారని, కానీ మరో ఐదేండ్లలోనే ఇది సాధ్యమవుతుందని ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కుజ్వెల్ వెల్లడించారు.
Read More :
Plastic | శరీరం ప్లాస్టిక్మయం.. సంతానోత్పత్తిపై ప్రభావం