ఏనుగులకు కొలనుల్లో ఈతకొట్టడం అంటే ఎంతో సరదా. వేసవికాలంలో బురద గుంటల్లో ఆటలాడుకుంటాయి. ఒకదానిపై ఒకటి బురద చల్లుకుంటూ ఉంటాయి. తరచూ సరస్సులు లేదా నదుల్లో ఈతకొడుతూ ఉల్లాసంగా గడుపుతాయి. కాగా, వాటికోసమే నిర్మించిన నీటిగుంతల్లో ఏనుగుల గుంపు ఆనందంగా విహరించడం నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సాకేత్ బడోలా ట్విటర్లో షేర్ చేశారు. ఉత్తరాఖండ్లోని రాజాజీ నేషనల్ పార్క్లో ఇటీవల ఏనుగుల కోసం నీటిగుంతలను నిర్మించారు. వీటిలో ఓ ఆహ్లాదకరమైన ఉదయం ఏనుగులు స్నానం చేస్తూ కెమెరాకు చెక్కాయి. ఏనుగుల గుంపు వరుసగా వచ్చి ఆ నీటి గుంతలో ఆటలాడుకున్నాయి. ఈ వీడియో ఇప్పటివరకూ లక్ష 61వేల వీక్షణలు పొందింది. 500 లైక్లతో వైరల్గా మారింది.
An Ele family having fun at a newly constructed waterhole in #RajajiTigerReserve. 🥰
Life is simple if we don’t complicate it. pic.twitter.com/VFDxQUWLOq— SAKET (@Saket_Badola) July 21, 2022