న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించింది. బహిరంగ సమావేశాలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. 1000 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న ఈసీ.. ఇండోర్లో 500 మందితో సభ నిర్వహణకు మినహాయింపును ఇచ్చింది. ఇంటింటి ప్రచారంలో 20 మందికి మాత్రమే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఇక రోడ్ షోలు, ర్యాలీలపై ఫిబ్రవరి 11వ తేదీ వరకు నిషేధం విధించింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఏడు దశల్లో, మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒకే విడుతలో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలకు, పంజాబ్లో 117 అసెంబ్లీ స్థానాలకు, మణిపూర్లో 60, గోవాలో 40 శాసనసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.