న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. అక్టోబర్ 4న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్, అసోం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి, తమిళనాడులో రెండు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.
నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 15న ప్రారంభమై.. 22వ తేదీ వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ సెప్టెంబర్ 27. అక్టోబర్ 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అనంతరం ఓట్లను లెక్కించనున్నారు.
Election Commission of India to hold Rajya Sabha bypolls for six seats – one each in West Bengal, Assam, Maharashtra & Madhya Pradesh & two seats in Tamil Nadu on October 4
— ANI (@ANI) September 9, 2021
Bypolls for an Assembly Council seat in Bihar to be held on October 4 pic.twitter.com/wj2AU0l7yv