ముంబై: తిరుగుబాటుకు ముందు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వద్దకు వచ్చిన ఏక్నాథ్ షిండే తనను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయబోతున్నాయని చెప్పారని, భోరున విలపించారని ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. షిండే, ఆయనతో వెళ్లిన ఎమ్మెల్యేలను కేంద్ర దర్యాప్తు సంస్థలు బెదిరించినందు వల్లే తిరుగుబాటు జరిగిందని తెలిపారు.
‘శివసేనను వీడటానికి వారికి ఏ కారణమూ లేదు. బీజేపీతో కలిసి వెళ్లకపోతే అరెస్టు అవుతామని ఏక్నాథ్ షిండే భయపడ్డారు’ అని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు.