Eid-Ul-Fitr | రంజాన్ నెల ముగింపు సందర్భంగా భారత్లో ముస్లింలు ఈదుల్ ఫితర్ (రంజాన్ పండుగ) మంగళవారం జరుపుకుంటారు. ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫతేపూరి మసీద్ ఇమామ్ ముఫ్తీ ముకారాం అహ్మద్ ఓ వార్తా సంస్థకు చెప్పారు. న్యూఢిల్లీ, బెంగాల్, బీహార్తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఆదివారం సాయంత్రం నెల వంక కనిపించలేదని తెలిపారు.
కనుక సోమవారం రంజాన్కు చివరి రోజు అని, మంగళవారం ఈదుల్ ఫితర్ జరుపుకుంటామని ముఫ్తీ ముకారాం అహ్మద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించలేదని మర్కాజీ చంద్ కమిటీ అధినేత ఖాలీద్ రషీద్ ఫిరంగి మహాలీ కూడా తెలిపారు. కనుక మూడో తేదీన ఈద్ జరుపుకుంటామని పేర్కొన్నారు.