న్యూఢిల్లీ, మే 18: వాతావరణంలో మార్పులు అటు పర్యావరణంపైనే కాకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నదని లాన్సెట్ జర్నల్ పేర్కొన్నది. వాతావరణంలో హెచ్చుతగ్గులు ప్రజల మెదడుపై దుష్ప్రభావం చూపుతున్నదని తెలిపింది. మైగ్రేన్ (పార్శపు నొప్పి), అల్జీమర్స్ వ్యాధులు ఉన్నవారిలో ఈ ప్రభావం అధికంగా ఉంటున్నదని పేర్కొంది.
అత్యధిక లేదా అత్యల్ప ఉష్ణోగ్రతలు మెదడు సంబంధిత వ్యాధులను ప్రభావితం చేస్తున్నాయని లండన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీకి చెందిన పరిశోధకుడు సంజయ్ సిసోడియా చెప్పారు.ఎండవేడిమి, వడగాలుల ప్రభావం మెదడుపై పడి చాలామంది పక్షవాతానికి గురవుతున్నారనివాతావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే వెంటనే ఆ పరిస్థితులకు అలవాటుపడాలని పేర్కొన్నారు.