న్యూఢిల్లీ: కొవిడ్ సమయంలో పార్లమెంట్లోకి జర్నలిస్టుల ప్రవేశంపై విధించిన ఆంక్షలు ఇంకా కొనసాగుతుండటంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణం ఆంక్షలను ఎత్తివేయాలని, పార్లమెంట్ సమావేశాల సంపూర్ణ వార్తల కవరేజీ కోసం జర్నలిస్టులు, కెమెరామెన్లను అనుమతించాలని కోరింది. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ ధనకర్లకు వేర్వేరుగా లేఖ రాసింది. మూడేండ్లకు పైగా ప్రెస్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని ఎడిటర్స్ గిల్డ్ అందులో ప్రస్తావించింది. 1952 మే నుంచి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ను కవర్ చేస్తున్న విషయాన్ని గుర్తుచేసింది.