తిరువనంతపురం, మే 14: ప్రముఖ మలయాళ నటుడు మోహన్లాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం నోటీసులు జారీచేసింది. పురాతన వస్తువుల డీలర్ మాన్సన్ మవుక్కల్కు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో వచ్చే వారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ప్రాచీన వస్తువుల విక్రయం పేరిట మానసన్ సుమారు రూ.10 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డాడని గత ఏడాది సెప్టెంబర్లో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మోహన్లాల్ గతంలో ఓ సారి మాన్సన్ నివాసానికి వెళ్లివచ్చారు. ఎందుకు వెళ్లారన్న వివరాలు వెల్లడికాలేదు. ఈ క్రమంలో మాన్సన్తో గల సంబంధాలపై మోహన్లాల్ను ఈడీ అధికారులు విచారించనున్నట్టు సమాచారం.