న్యూఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ డోటాస్ర కుమారులు అభిలాశ్, అవినాశ్లకు ఈడీ సమన్లు ఇచ్చింది. గోవింద్ విద్యా శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ల లీకేజ్ కేసులో విచారణకు ఈ నెల 7, 9 తేదీల్లో హాజరు కావాలని ఆదేశించింది. గత నెల 26న ఈ తండ్రీకొడుకుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది. స్వతంత్ర ఎమ్మెల్యే (ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి) ఓం ప్రకాశ్ హుడియాపై కూడా ఈడీ దృష్టి సారించింది. సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ను ఈడీ గత నెల 30న ప్రశ్నించిన సంగతి తెలిసిందే. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసులో ఆయనను ప్రశ్నించింది.