Fema Case | ఫెమా కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, దర్శన్ హీరానందానీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసింది. ఇద్దరిని ఈ నెల 28న విచారణ కోసం ఢిల్లీకి రావాలని కోరింది. ఫిబ్రవరిలో హిరానందానీ గ్రూప్ ప్రమోటర్లు నిర్జన్ హీరానందనీ, ఆయన తనయుడు దర్శన్ హీరానందనీని ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల క్రితం తనపై ఫెమా ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయని హీరానందనీ చెప్పారు. ఇప్పటి వరకు 42, 43 సార్లు విచారించారన్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సైతం మహువా మొయిత్రాపై లోక్పాల్లో ఫిర్యాదు చేయడం గమనార్హం.
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు బదులుగా టీఎంసీ ఎంపీ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ఆమె దేశ భద్రతతో ఆడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీఎంసీ నేతపై లోక్పాల్ ఫిర్యాదు చేయడంతో సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ సూచన మేరకే పార్లమెంట్లో ప్రశ్నలు సంధించారని ఆరోపించారు. ఆయనపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదు చేశారు. మహువా మొయిత్రా పార్లమెంట్లో అడిగిన మొత్తం 61 ప్రశ్నల్లో దాదాపు 50 ప్రశ్నలు దర్శన్ హీరానందనీ, అతని కంపెనీ వ్యాపార ప్రయోజనాలను కాపాడేవేనని తేల్చారు.