Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ నెల 3న విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విచారణకు రెండుసార్లు గైర్హాజరైన ఢిల్లీ సీఎం.. రేపు విచారణకు వెళ్తారా? లేదా? అన్న చర్చనీయాంశంగా మారింది. ఈడీ విచారణకు సీఎం వెళ్తారా ? లేదా? అన్నదానిపై ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం మీడియా సమావేశంలో స్పష్ట ఇచ్చింది.
ప్రకారం ఆప్ పని చేస్తుందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు. సీఎంకు నోటీసులు జారీ చేయడం చట్టవిరుద్ధమన్న ఆప్ పేర్కొంది. మూడోసారి విచారణకు హాజరుకాకపోతే ఈడీ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై ప్రియాంక స్పందిస్తూ న్యాయవాదులు ఈ విషయంలో సరైన సమాచారం ఇస్తారన్నారు. అక్టోబర్లో ఈడీ అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ నవంబర్ 2న రెండోసార్లు సమన్లు పంపింది. ఈ రెండుసార్లు సైతం ఆయన ఈడీ విచారణకు హాజరుకాలేదు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానన్న ఆయన.. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. అయితే, నవంబర్ 2న ఢిల్లీ సీఎం తరఫు న్యాయవాదులు ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ప్రకటించారు.