రాంచీ, డిసెంబర్ 11: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. భూ కుంభకోణం కేసులో మంగళవారం విచారణకు రావాలని సమన్లలో ఆదేశించింది. గతంలో ఈడీ ఐదు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ సొరేన్ హాజరుకాలేదు. ఈ సమన్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు, జార్ఖండ్ హైకోర్టుల్లో ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను కోర్టులు తోసిపుచ్చడంతో తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ స్పందిస్తూ ‘నేను ఏ తప్పు చేయలేదని సొరేన్ అంటున్నారు. అలాంటప్పుడు ఈడీ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదు. సీఎం చట్టానికి కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఆయన కట్టుబడకుం టే పదవి నుంచి తొలగించాలని గవర్నర్ను కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.