న్యూఢిల్లీ, ఆగస్టు 19: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈ నెల 24న తమ ముందు హాజరు కావాలని సూచించింది. వాస్తవానికి భూ కుంభకోణం కేసులో ఈ నెల 14నే హాజరు కావాలని ఈడీ ఆదేశించగా సొరేన్ వెళ్లలేదు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో బిజీగా ఉన్నానని, అందుకే హాజరుకాలేనని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది.