న్యూఢిల్లీ, ఆగస్టు 8: మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. వచ్చే వారం రాంచీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే ఆయనను ఏ కేసుకు సంబంధించి విచారణకు పిలిపించినదీ వెల్లడించలేదు.
అక్రమ మైనింగ్ కేసులో సొరేన్ను గతంలోనే ఈడీ ప్రశ్నించింది. డిఫెన్స్ భూముల కుంభకోణం కేసులో సొరేన్ను ఈడీ విచారించవచ్చునని భావిస్తున్నారు. ఈడీ సమన్లపై సొరేన్ కానీ, ఆయన కార్యాలయ వర్గాలు కానీ స్పందించ లేదు.