రాంచీ, నవంబర్ 15: జార్ఖండ్లో అక్రమ మైనింగ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. ఈ నెల 17న తనను ప్రశ్నించేందుకు జారీచేసిన సమన్లను ముందుకు జరపాలని, 16వ తేదీనే తనను ప్రశ్నించాలని ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తోసిపుచ్చింది. వాస్తవానికి ఈ కేసులో హేమంత్ సొరేన్ ఈ నెల 3నే ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉన్నది. కానీ, అధికారిక కార్యక్రమాలను కారణంగా చూపుతూ ఆయన ఆ రోజు హాజరు కాలేదు.