న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సోమవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు హాజరు కావాలని కోరింది. గత నెల 2న విచారణకు రమ్మని ఈడీ ఇచ్చిన నోటీసుకు కేజ్రీవాల్ స్పందిస్తూ అవి ఉద్దేశపూర్వకంగా ఇచ్చినవని పేర్కొన్నారు. విచారణకు గైర్హాజరయ్యారు. మంగళవారం నుంచి పది రోజులపాటు బయటకు వెల్లడించని ప్రాంతంలో కేజ్రీవాల్ విపాసన ధ్యానం కోర్సుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.