చంఢీఘడ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. అక్రమ శాండ్ మైనింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సోదాలు జరగడం గమనార్హం. హోమ్ల్యాండ్ హైట్స్లో ఉన్న చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ ఇంటితో పాటు మొత్తం పది ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మైనింగ్ కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ చెప్పింది. భూపిందర్పై మనీల్యాండరింగ్ కేసును ఈడీ బుక్ చేసింది. పంజాబ్లో మరో వైపు జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 20వ తేదీన ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ తన సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న విషయం తెలిసిందే.