న్యూఢిల్లీ, జూన్ 20: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీని సోమవారం కూడా ఈడీ ప్రశ్నించింది. నాలుగు రోజుల్లో మొత్తం 40 గంటలపాటు రాహుల్ను విచారించిన అధికారులు..మంగళవారం కూడా విచారణకు రావాలని సూచించారు. కాగా కరోనాతో ఇటీవల దవాఖానలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం డిశ్చార్జి అయ్యారు. గురువారం ఆమె ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నది.