న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. ఈ కేసులో మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియాను కోర్టు అనుమతితో ఈడీ అధికారులు 5 గంటల పాటు ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు.
బుధ, గురువారాల్లో కూడా ప్రశ్నించనున్నట్టు భావిస్తున్నారు. ఆయనపై ఈడీ అధికారులు ఏ క్షణమైనా పీఎంఎల్ఏ సెక్షన్-19 నమోదు చేయవచ్చని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఈడీ అధికారులు సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది.